ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి.
ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో 25 మంది స్థానం సంపాదించారు.
🔴అన్ని కులాలవారికి స్థానం :వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. 👉బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 👉 రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్ బెర్త్లు కేటాయించారు. 👉ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. 👉క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్ దక్కింది. 👉బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు.
🔴వివరాలు :
1. ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట)
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
4. అవంతి శ్రీనివాస్ (భీమిలి)
5. కురసాల శ్రీనివాస్(కాకినాడ రూల్)
6. పినిపే విశ్వరూప్ (అమలాపురం)
7. పిల్లి సుభాష్చంద్రబోస్ (ఎమ్మెల్సీ)
8. తానేటి వనిత (కొవ్వూరు)
9. ఆళ్ల నాని (ఏలూరు)
10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
11. కొడాలి నాని (గుడివాడ)
12. వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ)
13. పేర్ని నాని (మచిలీపట్నం)
14. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)
15. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
16. మోపిదేవి వెంకటరమణ
17. బాలినేని శ్రీనివాస్(ఒంగోలు)
18. మేకపాటి గౌతమ్రెడ్డి (ఆత్మకూరు)
19. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు)
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
21. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు)
22. అంజద్ బాషా (కడప)
23. శంకర్ నారాయణ (పెనుగొండ)
24. బుగ్గన రాజేంద్రనాథ్(డోన్)
25. గుమ్మనూరు జయరాం(ఆలూరు) 🔹శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు వైఎస్ జగన్ శాఖలను కేటాయించారు.
🔹హోంశాఖ: అనూహ్యంగా సుచరితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలను అప్పగించారు. 🌟నవ్యాంధ్రకు తొలి హోంమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు.
🔴ఐదుగురు కి డిప్యూటీ సీఎం పదవులు: పుష్ప శ్రీవాణి (ఎస్టీ), పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ), ఆళ్ల నాని (కాపు), నారయణస్వామి (ఎస్సీ), అంజ్ భాషా (మైనార్టీ) డిప్యూటీ సీఎం పదవులను కేటాయించారు. కాగా బుగ్గనరాజేంద్రనాథ్కి ఆర్థికశాఖ, గౌతమ్ రెడ్డికి పరిశ్రమలు, వాణిజ్యశాఖను, అనిల్ కుమార్ యాదవ్కు నీటిపారుదలశాఖ బాధ్యతలను అప్పగించారు.
🔳జాబితాలో వాళ్ళిద్దరి కి మొండి చెయ్యి: జాబితాలో ఖచ్చితంగా పేర్లు వుంటాయని అనుకున్న భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా పేర్లు లేవు. దీనితో ఒకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి కూర్పు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బహుశా… అందుకేనేమో… నిన్న భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయబోను అని చెప్పేశారు. అలాగే రోజా కూడా మౌనం దాల్చారు. మరి వీరికి జగన్ చెప్పినట్లు నెక్ట్స్ బంచ్లో… అంటే మరో రెండున్నరేళ్ల తర్వాత ఇస్తారేమో చూడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.