“సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్-నిబంధనల ప్రకారం ‘లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్’ పొందేందుకు ఎలాంటి విద్యార్హత అవసరంలేదు. లైసెన్స్కు దరఖాస్తు చేసుకునేవ్యక్తి ఆర్టీవో అధికారులు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితేచాలు. లైసెన్స్ వస్తుంది” వాహనచోదకులకు షాక్. డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కాబోతున్నాయి.
🤔నిరక్షరాస్యులైన వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్లను క్యాన్సల్ చేయాలని రాజస్తాన్ హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరక్షరాస్యులైన వాహన చోదకు లు పాదచారులకు హానికరంగా మారారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యం లోనే వారి డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయాలని రవాణా అధికారులను ఆదేశించింది.
డ్రైవింగ్-లైసెన్స్ను కోరేవారిని మాత్రమే కాకుండా, రోడ్లను ఉపయోగించే ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిరక్షరాస్యులు ఏదైనా వాహనాన్ని నడిపేందుకు అనుమతి ఇస్తూ డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయరాదని తెలిపింది.
నిరక్షరాస్యుడైన సంజీవ్ ప్రకాశ్ శర్మ అనే వ్యక్తి రవాణా అధికారుల నుంచి లైసెన్స్ ఇప్పించాల్సిందిగా హైకోర్టును అశ్రయించారు. ఈయన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పును వెలువరించింది.
🔴డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకుఅర్హత :
సెంట్రల్ మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. లైసెన్స్కు దరఖాస్తు చేసు కునే వ్యక్తి ఆర్టీవో అధికారులు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితే చాలు. లైసెన్స్ వస్తుంది. వాణిజ్య వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 8వ తరగతి వరకు చదివి ఉండాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.