Latest

    జగన్ మహేష్ బాబు చెప్పిందే follow అవుతున్నాడు..

    ఏ గ్రామానికి కావాలసిన పథకాలను ఆ గ్రామమే రూపొందించుకోవడం..అనేది గ్రామ సచివాలయం..యొక్క విధి విధానం. ఇదే మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాలో చర్చించిన కాన్సెప్టు.. అంటే మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. అదే విధం గా గ్రామ సచివాలయాన్ని రూపొందించాలని కొత్త సీఎం జగన్ ప్రకటించారు.
    🔴ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్:
    ప్రమాణ స్వీకార వేదికపైనే ఆయన ఈ ఆలోచన వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు.. అమలు చేసేందుకు.. అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు.
    🔴ఆగస్టు 15 నాటికి అమలు :
    గ్రామ వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల జీతం ఇస్తారట. ఈ పథకాన్ని వచ్చే ఆగస్టు 15 నాటికి అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం దాదాపు 4 లక్షల మంది గ్రామాల్లో చదువుకున్న యువకులకు వాలంటీర్లగా ఉద్యోగ అవకాశం వస్తుంది.

    👉ఈ గ్రామ సచివాలయం- వాలంటీర్ల ఐడియా బాగానే ఉంది. కానీ ఇప్పటికే అమల్లో ఉన్న వీఆర్వో, గ్రామ కార్యదర్శిలకు వీటిని ఎలా అనుసంధానం చేస్తారో చూడాలి.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading