మద్యపాన నియంత్రణ కోసం..జగన్ మాస్టర్ ప్లాన్..!!?

Spread the love

ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్‌ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు.
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు కారణాల వల్ల ఆనాడు మద్యనిషేదాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది.
అయితే జగన్‌ ఈ విషయంలో చాలా పకడ్బందీగా తన ప్లాన్‌ అమలు చేయబోతున్నారు. చాలా పేద కుటుంబాలు మద్యం వల్ల కుదేలయిపోవడం వల్ల ,ఎన్ని పథకాలు అమలు చేసినా, సామాజిక మార్పు రావడంలేదని గమనించిన జగన్‌ ఈ అంశం పట్ల సీరియస్‌గా ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే మద్యనిషేధం అమలు జరిగి తీరాలని ఈ ఆలోచన జగన్‌కి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డిదని వైసీపీ నాయకులంటున్నారు.
ఈ నేపధ్యంలో జగన్‌ ఆదివారం ,ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. 🔴ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో మాత్రమే మద్యం ; మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీని వల్ల ముందు సామాన్యులను ఈ వ్యసనాన్కి దూరం చేసి, కుటుంబాలను కాపాడ వచ్ఛని జగన్‌ భావిస్తున్నారు. 👉పథకం కొత్తగానే ఉంది కానీ మందు బాబుల కుటుంబాలకు..మేలు చేస్తేనే.. ఈ పథకం వల్ల ఉపయోగం..అంటున్నారు విశ్లేషకులు


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading