చనిపోయిందని మార్చురీ రిఫ్రిజరేటర్లో పెట్టిన ఒక మహిళ కొద్ది గంటల్లోనే లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పంజాబ్లోని కపుర్థలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
👉విషయం లోకి వెళితే :
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది 65సంవత్సరాల మహిళ. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి రిఫ్రిజరేటర్లో పెట్టారు. 👉ఇలా బ్రతికింది: ఆమె మెడలో గోల్డ్ చైన్ను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఉంచిన రిఫ్రిజరేటర్ను తెరిచి చూడగా ఆమె ఊపిరి పీల్చుకుంది. దీంతో సిబ్బంది వైద్యులకు సమాచారం ఇచ్చారు.
వైద్యులు వెంటనే ఆమెకు నీళ్లు తాగించారు. అనంతరం ఆమె కళ్లకు కట్టిన గంతలు తొలగించారు. ముఖం మీద నీళ్లు చల్లడంతో ఆమె కళ్లు తెరిచింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మరోసారి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను కుపర్థలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఆ బంగారమే రక్షించదని, దాన్ని తీసుకోడానికి మార్చురీకి వెళ్లి ఉండకపోతే అందులోనే ఆమె చనిపోయేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.