ఓడిపోవడం ఇష్టం లేక ఓడి పోయిన మయా..నాగరికత..*కోటి 50 లక్షల మంది ఒకే సారి సరస్సు లో…

Spread the love

సుమారు కోటి యాభై లక్షల జనాభా ఉన్న మయా నాగరికత ఒకటి ఉందని ఎవరికైనా తెలుసా.. . ఈ మధ్యే ఆ నాగరికతకు సంబంధించిన 60వేల శిథిలాలు బయటపడ్డాయి.

🐾 ఆ నాగరికత విశేషాలు మీ కోసం:

మయా..నాగరికత 3వేల ఏళ్ల క్రితం గ్వాటెమాల అడవుల్లో విస్తరించిన గొప్ప నాగరికత. ప్రపంచానికి తెలియకుండా దట్టమైన అడవులు, భారీ కొండల్లో దాగిన మయా.. మధ్యయుగం నాటి ఇంగ్లండ్ విస్తీర్ణం కన్నా రెట్టింపు విస్తీర్ణంలో ఈ నాగరికత విలసిల్లింది. మయా నాగరికత జనాభా సుమారు కోటి యాభై లక్షల వరకు ఉంటుంది. 🔴బయట పడ్డ మరికొన్ని మయా నాగరికత అవశేషాలు :

ఈ మధ్యే మయా నాగరికతకు సంబంధించిన 60వేల శిథిలాలు బయటపడ్డాయి. ఆనాటి ఇళ్లు, భవంతులు, విశాలమైన రహదారులు, రక్షణగా నిర్మించుకున్న కోట గోడలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

🔴అంత మంది జనాభా ఒకే సారి ఎలా చనిపోయారు..!!? : అసలు సుమారు కోటి యాభై లక్షల వరకు ఉన్న మయా జనాభా ఒకేసారి ఎలా చనిపోయారు?ఎక్కడ చనిపోయారు అన్న ఆధారాలను శాస్త్రవేత్తలు పరిశోదించగలిగారు.

🔴ఆధారాలు ఓ సరస్సులో దొరికాయి :
ఆ సరస్సు పేరు పీటెన్ ఇట్జా . ఈ సరస్సులోనే మయా నాగరికతకు చెందిన ప్రజలు చనిపోయారని, అది వారికి పాతాళలోకం అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మరి ఎందుకు చనిపోయారు అంటే..

🔴ఓటమి ఇష్టం లేక వారు:

వీరి ప్రాంతానికి వలస వచ్చిన స్పానిష్ వలసవాదులు వీరిని జయించినట్లు అవగతమవుతోందని, ఆ చోటే ఇరు వర్గాల మధ్య భారీ యుద్ధం జరిగి ఉంటుందని తెలిపారు. స్పానిష్ వలసవాదుల చేతుల్లో చనిపోవడం ఇష్టం లేక వీరు రాతి ఆయుధాలతో చేతులు కోసుకొని, సరస్సులో దూకి చనిపోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. సరస్సులో గ్లాస్ బ్లేడ్లు, ఆత్మహత్య చేసుకునేందుకు వాడిన రాతి పనిముట్లు, సహా వందలాది ఆయుధాలు, రాతి పరికరాలు లభ్యమయ్యాయని వెల్లడించారు. 👉అంటే వారు ఓడిపోవడం ఇష్టం లేక ఓడిపోయారు (చనిపోయారు).


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading