ఈ కాలంలో చర్మాన్ని హాయిగా ఉంచే ఫేస్ ప్యాక్ లలో Multhani మట్టితో చేసినవి ఉపయోగించడం బెస్ట్ . ముల్తానీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని సేద తీర్చడమే కాకుండా చర్మాన్ని మెరిపిస్తాయి కూడా .
మెరిపించే కొన్ని ముల్తానీ ఫేస్ ప్యాక్ లు మీకోసం :🔸ఓ గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల Multhani మట్టి తీసుకుని అందులో టేబుల్స్పూన్ చొప్పున పెరుగు , కీరా దోస తురుము,రెండు చెంచాల శెనగపిండి వేసుకుని బాగా కలపాలి .తర్వాత వీటికి పాలను కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకుని ముఖానికి మెడకు పట్టించాలి . 👉20నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేయాలి .ఈ పూత చర్మాన్ని మెరిపిస్తుంది .
👱🏿♀బ్లాక్ హెడ్స్ పోవడానికి : రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి ,టేబుల్ స్పూన్ పెరుగు ఒకటిన్నర చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ముఖం మెడకు పూతలా వేసుకుని బాగా ఆరనివ్వాలి . తరువాత తడి చేత్తో రుద్దుకుంటూ కడిగేసుకుంటే సరిపోతుంది.
🔸ఎండ వల్ల చర్మం రంగు మారుతుంటే : రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో అంతే మోతాదులో బంగాళదుంప గుజ్జును కలిప సమస్య ఉన్నచోట పూతలా పూసి ఆరాక కడిగేసుకుంటే చాలు. 👉2 టేబుల్ స్పూన్ల Multhani మట్టిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ల కొబ్బరి నీళ్లు, పావు టీ స్పూన్ చక్కెర వేసుకుని బాగా కలుపుకొని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకుంటే ట్యాన్ ఇట్టే తగ్గిపోతుంది.
🔸చర్మం బిగుతుగా ఉండటానికి : ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి వేసుకొని కాసిని నీళ్ళు పోసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత ముఖానికి పూసుకుని ఇలా చేసుకున్న 25 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం బిగుతుగా ఉంటుంది.
🔸చర్మం పొడిగా ఉండే సమస్య కు : ఎండాకాలమైనా కొంతమంది చర్మం పొడిగా ఉంటుంది .దీనికి రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక చెంచా గులాబీ నీరు చేర్చి బాగా కలిపి పూతలా వేసుకోవాలి..అరగంటాగి కడిగేసుకుంటే సరిపోతుంది.ఇలా Multhani Face packలు..మీరు ఇంటి వద్దే చేసుకోవచ్చు.మరింకేం..try చేసేయ్యండి మరి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.