పాకిస్తాన్ రూపాయి మే నెలలో 29 శాతం పడిపోయింది. ఆసియా 13 కరెన్సీల్లో ఇదే ఎక్కువగా పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే 153 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో అక్కడి సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 12.25 శాతానికి పెంచింది. ఆర్థిక వృద్ధి కూడా 2.9 శాతానికి పడిపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గతేడాది ఆర్థిక వృద్ధి 5.2 శాతంగా ఉంది.
🔴పాకిస్తాన్ కి తీవ్ర గడ్డు కాలం :పాకిస్తాన్ తీవ్ర గడ్డు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం తాండవం చేస్తోంది. పాకిస్తాన్ కరెన్సీ కనిష్ట స్థాయిలకు పతనమైంది. ఆర్థిక వృద్ధి కూడా దాదాపు సగానికి పడిపోవచ్చనే అంచనాలున్నాయి.
🔴ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి : ఆహార పదార్థాల ధరలు చుక్కులనంటడం తో..అక్కడి ప్రజలు ఏం కొనలేకపోతున్నారు,తినలేకపోతున్నారు.
👉పాకిస్తాన్లో డజన్ నారింజ పండ్ల ధర రూ.360గా ఉంది. 👉 కేజీ నిమ్మకాయలు, ఆపిల్ పండ్ల ధర రూ.400 చేరింది. 👉డజను అరటి పండ్లు ధర రూ.150గా ఉంది.
🔴ఘాటెక్కిన నాన్ వెజ్ ధరలు: చికెన్ ధర అక్కడ రూ.320గా ఉంది. మటన్ ధర అయితే కేజీ ఏకంగా రూ.1,100కే పలుకుతుంది. 👉లీటరు పాలు కొనాలంటే రూ.190 పెట్టాల్సిందే.
మార్చి నెలతో పోలిస్తే మే నెలలో ఉల్లిపాయల ధర 40 శాతం, టమోట ధర 19 శాతం, పెసరపప్పు ధర 13 శాతం పెరిగింది. అలాగే బియ్యం, నూనె, చక్కెర, వంటి వాటి ధర కూడా 10 శాతం ఎగసింది. 🔅అలాగే ఆటో, సిమెంట్, ఫార్మా ప్రొడక్టుల ధరలు కూడా పెరిగే అవకాశముందిన స్థానిక సంస్థలు పేర్కొంటున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.