Latest

    PM Modi: సౌదీలో ప్రధాని మోదీ పర్యటన.. క్రౌన్ ప్రిన్స్‌ బిన్ సల్మాన్‌పై ప్రశంసలు

    క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాకు చేరుకున్న మోదీ.. 2016 నుంచి ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.

    క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఇక రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాకు చేరుకున్న మోదీ.. 2016 నుంచి ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. భారత్, సౌదీ అరేబియా మధ్య స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయని.. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో దోహదపడ్డ క్రౌన్ ప్రిన్స్‌ కీలక పాత్ర పోషించడం అభినందనీయం అని ప్రధాని మోదీ అన్నారు. అక్కడ స్థానిక న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ.. ప్రిన్స్ బిన్ సల్మాన్ తమకు విశ్వసనీయ, వ్యూహాత్మక మిత్రుడిగా అభివర్ణించారు మోదీ. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయని మోదీ స్పష్టం చేశారు.

    ‘మా భాగస్వామ్యానికి అపరిమిత సామర్థ్యం ఉంది’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘అనిశ్చితులతో నిండిన ప్రపంచంలో, మా బంధం స్థిరత్వానికి స్తంభంగా మారి బలంగా ఉంది.’ సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘క్రౌన్ ప్రిన్స్ మా ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన అడ్వకేట్‌గా నిలిచారు’, విజన్ 2030 కింద సంస్కరణల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను ప్రేరేపించిన దార్శనికుడు ఆయన అని ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు.

    “నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, ఆయన రాయల్ హైనెస్ నాపై లోతైన ముద్ర పడేలా చేసింది. ఆయన దూరదృష్టి, భవిష్యత్తును ఆలోచించే దృక్పథం, తన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే ఆలోచనలు నిజంగా అద్భుతమైనవి” అని ప్రధాని మోదీ అన్నారు. ఉమ్మడి ఆర్థిక ఆశయాలను ప్రస్తావిస్తూ.. ఇంధనం, వ్యవసాయం, ఎరువులు కీలక రంగాలుగా ఉన్న ప్రపంచ సవాళ్ల మధ్య కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సౌదీ, భారతీయ వ్యాపారాల లోతైన ఏకీకరణను ఆయన స్వాగతించారు. “సౌదీ అరేబియాలోని వివిధ రంగాలలో భారతీయ కంపెనీలు కూడా బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి” అని మోదీ అన్నారు.

    2030 వరల్డ్ ఎక్స్‌పో, 2034 ఫిఫా వరల్డ్ కప్ ఆతిధ్యానికి సిద్దమైన సౌదీ కింగ్‌డమ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. సెప్టెంబర్ 2023లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రారంభించబడిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEEC)పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ “మొత్తం ప్రాంతంలోని వాణిజ్యం, కనెక్టివిటీ, వృద్ధికి కీలకమైన ఉత్ప్రేరకం”గా మారుతుందన్నారు. “సౌదీ అరేబియా రాజ్యంతో భారతదేశం తన ద్వైపాక్షిక సంబంధానికి ఇస్తున్న ప్రాముఖ్యతను ఈ ప్రధాని మోదీ పర్యటన ప్రతిబింబిస్తుంది” అని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

     


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading