మా అమ్మకు మతిస్థిమితం లేదు..అంటున్న Ranu Mondal కూతురు

Spread the love

Teluguwonders:

ఇన్నాళ్లూ ఆమె ఎంతో కష్టపడింది. కానీ దేవుడు ఇచ్చిన తియ్యటి గొంతుతో ఆమెకు సువర్ణావకాశం లభించింది. నేను ఆమెకు కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను’ అని అంటూనే తన తల్లికి మతిస్థిమితం లేదని అంటున్నారు సింగింగ్ సెన్సేషన్ రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్ సతీ రాయ్. ఆమెను ఇంట్లో ఉంచుకోలేక ఓ ఆశ్రమంలో చేర్పించానని ఆ తర్వాత ఆమె ఎలా ఇంత పాపులర్ అయ్యారో తెలీలేదని అంటున్నారు ఆవిడ.

👉వివరాల్లోకి వెళితే :

💥ఒక్క పాటతో స్టార్‌డం:

రణఘాట్‌కు చెందిన రణు మోండల్..కోయిలలాంటి గొంతు తో ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌డం సంపాదించుకున్నారు . కోయిలలాంటి ఆమె స్వరమే ఆమెకు ఇంతటి పాపులారిటీని తెచ్చిపెట్టింది. రైల్వే స్టేషన్‌లో పాట పాడిన ఆమె ఇప్పుడు ఫేమస్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద పాడుతోంది. అయితే తన తల్లికి మతిస్థిమితం లేదంటూ తాజాగా మీడియా ముందుకు వచ్చారు రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్.

🔴కొందరు బెదిరిస్తున్నారని :

నాతో పాటు ఉండటం తనకు ఇష్టం లేదు అంది. అందుకే దగ్గర్లోని ఆమ్రా షోభాయ్ షోయితాన్ అనే ఆశ్రమంలో చేర్పించాను. తన తల్లి నివసించే ఆశ్రమంలోని కొందరు వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని వాపోయారు. ఆ ఆశ్రమాన్ని అతీంద్ర, తపన్ అనే ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా అమ్మ ఫేమస్ సింగర్ అయిపోయింది కాబట్టి ఆమె డబ్బును వాడుకోవాలని చూస్తున్నారు. నన్ను అమ్మతో మాట్లాడనివ్వం లేదు. ఫోన్ చేస్తే కాళ్లు విరగొడతాం అని బెదిరిస్తున్నారు’
‘నన్నేం చేయమంటారు? తొందరపడి నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ఎందుకంటే అమ్మ కెరీర్ పాడవుతుంది. అదీకాకుండా మా అమ్మకు మతిస్థిమితం లేదు. పైగా మీడియా వర్గాలు ఆమెను టార్చర్ పెడుతున్నాయి. తపన్, అతీంద్రలు మా అమ్మను చూసుకోవాల్సిన అవసరం ఏంటి? వారికి కుటుంబాలు లేవా? అమ్మతో కలిసి నన్ను ముంబయి వరకు వెళ్లనివ్వడం లేదు. ఆమెకు కావాల్సిన సరుకులు తెస్తానని తపన్ డబ్బులు తీసుకున్నారు. నాకు వారిపై ఎలాంటి నమ్మకం లేదు.

🔴అందరూ నన్ను తిడుతున్నారు :

‘రైల్వే స్టేషన్‌లో మా అమ్మ పాటలు పాడుతుంటుందని నాకు తెలీదు. ఎందుకంటే ఆమెను నేను రోజూ కలిసేదాన్ని కాదు. కొన్ని నెలల క్రితం కోల్‌కత్తాలోని ధర్మశాల వద్ద ఉన్న ఓ బస్టాప్‌లో అమ్మను చూశాను. తన చేతిలో రూ.200 పెట్టి ఇంటికి వెళ్లమని చెప్పాను. నేను అమ్మను నడిరోడ్డు మీద వదిలేశానంటూ అందరూ నన్ను తిడుతున్నాను. నేను నా భర్తతో విడిపోయాను. నాకు తొమ్మిదేళ్ల కూతురు ఉంది. ఓ చిన్న దుకాణాన్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నాను. నా కూతుర్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే’
‘ అప్పటికీ అమ్మను చూసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. మా నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. దాంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ నేను వారితో మాట్లాడను. ఇప్పటివరకు అమ్మను నేనొక్కదాన్నే చూసుకుంటూ వచ్చాను. వారికి బాధ్యత లేదా? వారికి కూడా తల్లే కదా? అందరూ నన్ను అంటే ఎలా? నన్ను చాలా మంది నానా మాటలు అన్నారు. అయినప్పటికీ నేను మా అమ్మను చూసుకుంటాను. ఆమె ముంబయి నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను. అమ్మకు నా విన్నపం ఒక్కటే. ఆమె నాతో పాటు నా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నేను ఆమెను బలవంతం చేయను. ఆమెకు ముంబయిలోనే ఉండాలని ఉంటే నేను నా కుమారుడితో కలిసి తనతోనే ఉంటాను.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading