“మేఘాంశ్” హీరోగా కార్తీక్ – అర్జున్ దర్శక ద్వయంలో “రాజ్దూత్” అనే చిత్రం రూపొందనుంది. “మేఘాంశ్”, అంటే మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహరి పెద్ద కొడుకు. శ్రీ హరి కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉన్న సమయం 2013లో ఆయన హఠాత్తుగా మరణించడంతో అభిమానులు ఆందోళన చెందారు. శ్రీహరి మరణం తర్వాత ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకి రాలేదు. తాజా సమాచారం ప్రకారం శ్రీహరి పెద్ద తనయుడు మేఘాంశ్ హీరోగా వెండితెరకి పరిచయం కానున్నాడని అంటున్నారు.
👉 చైల్డ్ ఆర్టిస్ట్ గా : మేఘాంశ్ చైల్డ్ ఆర్టిస్ట్గా “భైరవ” అనే సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు. ఇందులో శ్రీహరి హీరోగా నటించారు. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్న మేఘాంశ్ త్వరలో రాజ్దూత్ అనే సినిమాతో వెండితెరకి పరిచయం కానున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ళ పాటు నటనలో శిక్షణ తీసుకున్న ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడట. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.
👉మాస్ రోల్ లో : రొమాంటిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట. 🔸త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న “మేఘాంశ్” కూడా తన తండ్రి అంత పేరుతెచ్చుకోవాలని మనసారా ఆశిద్దాం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.