అన్యాయంగా ఒక క్రికెటర్ ని చంపేసిన social media…

Spread the love

సోషల్ మీడియాలో ఈ మధ్య మంచి వార్తల కంటే చెడు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రెటీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బతికి ఉన్న వారిని నిర్థాక్షిణ్యంగా చనిపోయారని టాం టాం చేస్తూ వాళ్ల గుండె గుభేల్ మనిపించిన సంఘటనలు ఎన్నోఉన్నాయి. 👉 ఎంతో మంది సిని, రాజకీయ, క్రీడా కారులు చనిపోయారని..రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలని ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై వారు స్పందించిన బాబో మేం బాగానే ఉన్నాం అని క్లారిటీ ఇస్తే కాని ఆ ఎపిసోడ్ కి తెరపడదు.
🔴విషయం లోకి వెళ్తే :
తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య కెనడాలో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ మేరకు అశ్విన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘సనత్ జయసూర్య గురించి వచ్చిన వార్త నిజమేనా? అది వాట్సాప్ ద్వారా నాకు తెలిసింది. అయితే ట్విట్టర్‌లో ఎక్కడా ఆ ప్రస్తావన కనిపించలేదు’ అని ఆరా తీశాడు.

ఆయన తర్వాత వరుసగా ఎంతో మంది జయసూర్యకు ఫోన్లు చేయడం..వాట్సాప్ చేయడం జరుగుతుందని ఆవేదన చెందాడు జయసూర్య. తనకేం కాలేదని, ఎందుకిలా లక్షణంగా బతికి ఉన్నవారిని ఇలా దారుణంగా చంపుతారు..మీ రేటింగ్స్ కోసం ఇతర మనోభావాలతో ఆడుకోవడం ఎంత వరకు న్యాయం అని.. ఇలాంటి తప్పుడు వార్తలతో తన కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని కోరాడు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading