చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది ,వై ఎస్ జగన్ కు నా ఆశీస్సులు : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు

Spread the love

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఫోన్‌లో జగన్‌కు ఆశీస్సులు, కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

👉విషయం లోకి వెళ్తే : ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి స్వరూపానందేంద్ర ఫోన్‌లో ఆశీస్సులు అందజేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన స్వామీజీ పట్ల ఎనలేని కృతజ్ఞతతో ఉంటానని జగన్‌ చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంపై సీఎం కేసీఆర్‌కు పీఠాధిపతి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 🔴చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ; 👉విశాఖ నగర పరిధి చినముషిడివాడలోని పీఠంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 🔥ఆధ్యాత్మిక పీఠాలు, మఠాల జోలికొస్తే రాజకీయ పీఠాలు గల్లంతవుతాయని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హెచ్చరించారు. . 👉 పీఠాల జోలికెళ్లడం వల్లే గత ప్రభుత్వ అధినేతకు ఈ దుస్థితి కలిగిందన్నారు. హిందూమతాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో ఆనేక దేవాలయాలను కూల్చివేయడం, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని సైతం రాజకీయాలకు వాడుకోవడం తమకు ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినా బేఖాతరు చేయడమే కాకుండా పీఠాధిపతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారు.

🔴తమిళనాడులో కంచి స్వామి జోలికి వెళ్లిన జయలలిత పతనమైనవిధంగానే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పతనాన్ని కొనితెచ్చుకుందన్నారు.ఈ సందర్భం లో ఆధ్యాత్మిక పోరాటమే పీఠం లక్ష్యమని స్పష్టం చేశారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading