జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది ఆయన డిక్షనరీలో.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఉన్న కాస్త సమయంలోనే పాలనను పరుగులు పెట్టించడానికి నిర్ణయాలు తీసేసుకున్నారు జగన్. ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు తీసేసుకుంటూ.. తాను కోరుకున్న విధంగా పాలనను సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
🔴 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానన్న హామీ :ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పవర్లోకి వస్తే.. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానన్న హామీకి తగ్గట్లే తాజాగా కొత్త జిల్లాల మీద కసరత్తు ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. ఆ ఫైలు . ఇప్పటికే దానికి సంబంధించిన ముసాయిదా రెఢీ అయ్యిందని.. కొత్త జిల్లాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసినట్లే చెబుతున్నారు.కూడ.
🔴రాబోతున్న మరో 12 జిల్లాలు:ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని.. గిరిజన జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజన జిల్లాను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 26 జిల్లాలు అవుతాయి. కానీ ఆ జిల్లా ఏర్పాటు పై ఇంకా స్పష్టత రాలేదు.ఆ ప్రాంతాన్ని పక్కన పెడితే ఏపీ లో 🔴రాబోయే పాతిక
కొత్త జిల్లాలు ఇవే:
👉విశాఖ జిల్లాలో ;
అరకు,
అనకాపల్లి,
👉తూర్పుగోదావరి జిల్లాలో ;
అమలాపురం,
రాజమండ్రి.
👉పశ్చిమగోదావరి జిల్లాలో ;
నరసాపురం
👉కృష్ణా జిల్లాలో ;
విజయవాడ
👉గుంటూరు జిల్లాలో ;
నర్సరావుపేట,
బాపట్ల. 👉కర్నూలు జిల్లాలో ;
నంద్యాల
👉అనంతపురం జిల్లాలో ;
హిందూపురం
👉చిత్తూరు జిల్లాలో ;
తిరుపతి
👉కడప జిల్లాలో ;
రాజంపేట.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.