అసలే దేశ జనాభా పెరిగి సమస్యలు ఉధృతమవుతున్నాయి . అక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ ముగ్గురిని కనాలని కండిషన్ ని పెడుతున్నారు . 👉ఆ గోడవేంటో చూద్దాం రండి.
🔴జైనుల ఉనికి కోసం ఆందోళన : దేశంలో జైనుల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఇండోర్లో జరిగిన దిగంబర జైన మహాసభ ‘మేమిద్దరం.. మాకు ముగ్గురు ‘అనే నినాదం ఇచ్చింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని జైన దంపతులకు పిలుపునిచ్చింది.
🔴 జనాభా తగ్గుతోంది ప్రతీ ఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనాలి: దేశంలో జైనుల జనాభా తగ్గుతుండటం ఆ మతస్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
🔴దేశ జనాభా నిష్పత్తి తో పోలిస్తే అక్కడి జనాభా నిష్పత్తి : 2001 నుంచి జైనుల జనాభా పెరుగుదల శాతం స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జైన మహాసభ అప్రమత్తమైంది. తమ మతం ఉనికిని చాటడానికి చర్యలు చేపట్టింది 👉2001లో దేశంలో 42 లక్షల మంది ఉన్న జైనుల జనాభా 2011 నాటికి 44 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో దేశ జనాభా 102 కోట్ల నుంచి 120 కోట్ల మందికి పెరిగింది. 👉2001లో జైనుల జనాభా పెరుగుదల శాతం 0.40గా ఉండగా.. 2011 నాటికి అది 0.37కు పడిపోయింది.
జైన దంపతుల్లో పిల్లలు లేని వారి శాతం కూడా పెరుగుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ మతస్థుల్లో పిల్లలులేని దంపతులు 1.2 శాతం మంది ఉన్నారు. అందుకే జైనుల జనాభాను పెంచడానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలను కనాలని ఆ వర్గానికి చెందిన దంపతులకు పిలుపునిచ్చింది. 🔴Conditions: 👉యుక్త వయసుకు వచ్చిన యువతీ యువకులు త్వరగా పెళ్లి చేసుకోవాలని.. 👉విడాకులు తీసుకున్న జంటలు మళ్లీ కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని జైన మహాసభ సూచించింది.
🔹ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి ఆర్థికసాయం :
👉జైన దంపతుల్లో విడాకుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఎక్కువ మంది పిల్లల్ని కన్న దంపతులకు ఆర్థిక సాయం అందించాలని జైన మహాసమితి నిర్ణయించింది జైనుల్లో అధిక సంతానాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా మూడో సంతానం చదువుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని జైన మహాసమితి జాతీయ అధ్యక్షుడు అశోక్ బడ్జాతియా ప్రకటించారు. ఆర్థిక సమస్యలతో జైనులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదని.. అలాంటి వారిని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.