Teluguwonders:
వాల్మీకి :
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే, మృణాళిని రవిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కి జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించారు
💥బిగ్ ట్విస్ట్ :
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వాల్మీకి’ థియేటర్స్ లో ఉంది. ఐతే భారీ అంచనాల మధ్య మరికొన్ని గంటల్లో రిలీజ్ అనగా నిన్న రాత్రి ఈ చిత్ర టైటిల్ను మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్.
🔴గద్దలకొండ గణేష్ గా మారిన వాల్మీకి:
అనేక వివాదాల నడుమ టైటిల్ను ‘గడ్డలకొండ గణేష్’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. గత కొంతకాలంగా ‘వాల్మీకి’ చిత్ర టైటిల్ను మార్చాలని కోరుతూ బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా టైటిల్ మార్పు విషయంలో చిత్ర యూనిట్ రిలీజ్ వరకూ వెనక్కి తగ్గకపోవడంతో హైకోర్ట్ను ఆశ్రయించారు బోయ కులస్థులు. టైటిల్ మార్పుపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. చిత్ర యూనిట్ని హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీంతో వెనక్కితగ్గిన చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైమెంట్స్ టైటిల్ను ‘గద్దల కొండ గణేష్’గా మారుస్తున్నట్టు కోర్టుకు తెలిపారు.
అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేయాల్సిన ప్రమోషన్స్ అంతా పూర్తి చేసేసి విడుదలకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉండగా.. టైటిల్ మార్పు చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిత్ర యూనిట్. 👉టైటిల్ మార్పుతో ‘వాల్మీకి’ వివాదానికి తెర పడింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.