Teluguwonders:
🔴రంగస్థలం మూవీ :
తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి నటన ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసింది. సుకుమార్ టేకింగ్, దేవీ శ్రీ బాణీలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉన్నాయి. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది రంగస్థలం. ఇలాంటి సూపర్ హిట్ మూవీని ఇప్పుడు కేరళలో మలయాళం వర్షన్ లో రిలీజ్ చెసారు.
🔴 మెగా పవర్ డిమాండ్ :
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈయన నటించిన హిట్ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో రామ్ చరణ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. గతంలో చెర్రీ నటించిన మగధీర సినిమా మలయాళంలో విడుదలై విజయం భారీ సాధించింది.
🔴మల్లు వుడ్ లో ‘రంగస్థలం’ :
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ మలయాళంలో కేరళ రాష్ట్రంలో రిలీజ్ చేయబడింది. తెలుగులో ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీ చూసి ఇప్పుడు మలయాళంలో రిలీజ్ చేశారు.
తెలుగులో విడుదలైన ఏడాది తర్వాత మలయాళంలో విడుదల చేసారు. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 220 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా 125 కోట్లకు పైగానే తీసుకొచ్చింది.
సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి నటనకు కూడా అద్భుతమైన పేరు వచ్చింది. ఇప్పుడు మలయాళంలో కూడా రంగస్థలంకు మంచి టాక్ వచ్చింది.
🔴 ఉపాసన సోషల్ మీడియా ప్రమోషన్స్ :
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటూ తనకు, తన కుటుంబానికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతూ ఉంటుంది ఉపాసన. ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్బుక్లో పెట్టిన రంగస్థలం మలయాళం పోస్టర్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి తన వంతు చిత్రానికి ప్రమోషన్ చేసింది ఉపాసన.
ఈ విషయాన్ని ఫేస్ బుక్ వేదికగా తెలిపి రామ్ చరణ్.. ‘రంగస్థలం’ జర్నీ మలయాళంలో కూడా సాగుతోందని తెలుపుటకు సంతోషిస్తున్నాను అని పేర్కొన్నాడు.
🔴మెగా అభిమానుల హర్షం :
రంగస్థలం ని మలయాళం వర్షన్ లో రిలీస్ చేయడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.