నేను బాగానే ఉన్నాను..వదంతులు సృష్టించొద్దన్న హీరో

Spread the love

Teluguwonders:

ఆ హీరోక్యాన్సర్ చికిత్స పూర్తి..చేసుకుని ఏడాది తర్వాత ముంబయి చేరుకున్నారు .
అంతే కాదు ఆయన క్యాన్సర్ కారణంగా నాలుగు నెలల పాటు తిండి లేకుండా ఉన్నారట. దాంతో బాగా బరువు తగ్గిపోయారు. చికిత్స ప్రభావంతో ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ పూర్తిగా తగ్గిందో లేదో మాత్రం ఆయనే చెప్పాలి. ఆయన మరెవరో కాదు కపూర్ ఫామిలీ కి చెందిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. రిషి కపూర్ భారత్ చేరుకున్నారు. దాదాపు ఏడాది పాటు క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న రిషి మంగళవారం తన ఇంటికి చేరుకున్నారు. న్యూయార్క్‌లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ముంబయి వస్తానా అని రిషి చాలా దిగులుచెందేవారు. ముంబయి వచ్చిన తర్వాత తనకు సినిమా అవకాశాలు వస్తాయా అని తన కుమారుడు రణ్‌బీర్ కపూర్‌ను అడుగుతూ ఉండేవారట.

💥వివరాల్లోకి వెళ్తే :

ఏడాది పాటు క్యాన్సర్‌తో బాధపడి కోలుకున్న బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఎట్టకేలకు ముంబయి చేరుకున్నారు. మంగళవారం ఆయన న్యూయార్క్ నుంచి ముంబయికి వచ్చారు. దాంతో ముంబయి వద్ద ఉన్న సిబ్బంది, మీడియా ఫొటోగ్రాఫర్లు ఆయన్ను సాదరంగా స్వాగతించారు. క్యాన్సర్ కారణంగా రిషి చాలా సన్నబడ్డట్లు కనిపిస్తున్నారు. ఏడాది క్రితం చెకప్ నిమిత్తం అమెరికా వెళుతున్నానని ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు రిషి. త్వరలో తిరిగి వస్తానని, దయచేసి తన ఆరోగ్యం గురించి ఎవ్వరూ తప్పుడు వదంతులు సృష్టించొద్దని కోరారు.

ఆ తర్వాత చాలా నెలల పాటు రిషి న్యూయార్క్ నుంచి రాకపోవడంతో ఆయనకు క్యాన్సర్ అని మూడో స్టేజ్‌లో ఉందని పలు బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొ్న్నాయి. కానీ రిషి సోదరుడు రణ్‌ధీర్ కపూర్ ఆ వదంతులను తోసిపుచ్చారు. 👉రిషి ప్రశాంతంగా చికిత్స తీసుకుంటున్నారని, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించొద్దని పేర్కొన్నారు.

 🔴న్యూ ఇయర్ పోస్ట్ :

న్యూ ఇయర్ సమయంలో రిషి భార్య నీతూ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను కోరుకుంటున్నది ఒక్కటే. దేశంలో ఎక్కడా పేదరికం అనేది ఉండకూడదు. ఇక నుంచి క్యాన్సర్ అనేది జోడియాక్ (కర్కాటక రాశి) సైన్ మాత్రమే అయివుండాలి’ అని పేర్కొన్నారు. 👉ఈ పోస్ట్ తర్వాతే రిషికి క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసింది. అప్పటినుంచి ఎందరో బాలీవుడ్ సినీ ప్రముఖులు రిషిని చూసేందుకు న్యూయార్క్ వెళ్లారు. వారితో కలిసి దిగిన ఫొటోలను నీతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపేవారు.
మున్ముందు రిషి సినిమాల్లో నటిస్తారా? లేక విశ్రాంతి తీసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన చివరగా ‘ఝూటా కహీ కా’ అనే చిత్రంలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading