Teluguwonders:
సాయి ధరం తేజ్ కు మొన్నటి వరకు రెజీనా తో ఎఫైర్ అన్నారు .కానీ సాయి ధరం తేజ్ తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు . కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. ఆ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు .
💥ఇండస్ట్రీలో పుకార్లు మామూలే :
సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేవి వినిపిస్తూనే ఉంటాయి. హీరోలు ఎవరైనా హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నా.. కలిసి రెండు, మూడు సినిమాలు చేసినా.. వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వస్తుంటాయి. 👉సుప్రీం హీరో సాయి ధరం తేజ్ పై కూడా ఇలాంటి వార్తలు వినిపించాయి. కానీ తేజ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
తాజాగా తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై స్పందించాడు ఈ హీరో. తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు. కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. తనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
కాలేజ్ పూర్తయిన తరువాత సాయి ధరం తేజ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఐదేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తో దూరం పెరిగిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్ జరగడానికి సరైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ తన మాటల్లో సెటిల్ కాకపోవడం వలనే ప్రేమ వదులుకున్నాడని అర్ధమవుతోంది.
ప్రస్తుతం సాయి ధరం తేజ్ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కానీ తను సెటిల్ అయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పేశాడట.
🔴ఇక ఇండస్ట్రీలో వినిపించే రూమర్స్ పై స్పందిస్తూ..’నేను చాలా మంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటాను. దాని కారణంగా డేటింగ్ రూమర్లు వస్తున్నాయి. కానీ వారంతా నాకు మంచి ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. 👉ప్రస్తుతం ఈ హీరో మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.