హైదరాబాద్: నగరంలో జరిగిన పలు పెళ్లి వేడుకల్లో నటుడు నాగశౌర్య, నటి రీతూవర్మ కలిసి సందడి చేశారు.
వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి.. తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటించిన యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ ఫీల్గుడ్ చిత్రం అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ వెరైటీ ప్రమోషన్స్కు తెరతీసింది. ఇప్పటికే ‘వరుడు కావలెను సంగీత్ సెలబ్రేషన్స్’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ బృందం ఇప్పుడు మరోసారి కొత్త ఆలోచనతో ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది.
సోమవారం ఉదయం హైదరాబాద్ నగరంలో జరిగిన కొన్ని పెళ్లి వేడుకలకు నాగశౌర్య, రీతూవర్మ ఆకస్మికంగా హాజరై, వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరుకున్నారు. నటీనటుల సడెన్ ఎంట్రీతో పెళ్లివాళ్లందరూ ఒకింత సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.