అందుకే చంద్రబాబు ఈ ఆత్మకూరు డ్రామా అంటున్న విజయసాయిరెడ్డి

Atmakur Drama: Vijayasai Reddy
Spread the love

Teluguwonders:

పల్నాడులో అరాచకాలకు పాల్పడిన టీడీపీ నేతలను కాపాడుకోవడానికే చంద్రబాబు చలో ఆత్మకూరు డ్రామాకు తెరలేపారు. వారి అరాచకాలను కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటూ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.

💥చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు :

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.గత ఐదేళ్లలో పల్నాడులో టీడీపీ నేతల అరాచకాలు బయటకు రాకుండా కప్పిపెట్టేందుకే ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో అరాచకాలకు పాల్పడి ఓడిపోయిన మాజీలు కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావును కాపాడేందుకే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నేతలందరినీ సమీకరించి తీసేసిన తాసీల్దార్లకు ధైర్యం ఇచ్చేందుకే చలో ఆత్మకూరు చేపట్టారని ఆరోపించారు.

చంద్రబాబు డ్రామా వికటించినా ఒక ప్రయోజనం కలిగిందని విజయసాయి అన్నారు. కోడెల, యరపతినేని, ప్రత్తిపాటి రాకపోయినా నిద్దురపోతున్న పల్నాడు ప్రాంతయేతర నేతలను మేల్కొలిపారంటూ ఎద్దేవా చేశారు. స్థానిక నేతలు బయటకు రాకున్నా సుదూర ప్రాంతాల నుంచి అచ్చెన్నాయుడు, కాలవ శ్రీనివాసులు వచ్చారని సెటైర్లు వేశారు.

గతేడాది టీడీపీ నేతలపై ఐటీ, ఈడీ కేసులు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టారని విమర్శించారు. ప్రధాని మోదీని సైతం గద్దె దింపుతామని హెచ్చరికలు కూడా చేసిన విషయం అందరికీ గుర్తుందన్నారు.

🔴అతని కేసు సీబీఐకి అప్పగించడంతో :

అక్రమ మైనింగ్ వ్యవహారంలో యరపతినేని కేసు సీబీఐకి అప్పగించడంపైనా విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేసు సీబీఐకి వెళ్తుందని తెలియగానే చంద్రబాబు చిల్లర వేషాలు మొదలు పెట్టాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading