Teluguwonders:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా ఛానల్ తో మాట్లాడిన బొత్స సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
💥గతంలో పవన్ వ్యాఖ్యలు:
మొన్న ఆగస్టు 30, 31 తేదీల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు “జాగ్రత్త “అంటూ బొత్స ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు . జగన్ రెడ్డి తో జాగ్రత్త అని సూచించారు .ఈ ప్రభుత్వం లో మీరు సీఎం కావచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఆ ఫోక్స్వ్యాగన్ కేసు ఏదో ఉందనుకుంటా అంటూ హెచ్చరించారు.
💥చంద్రబాబుకు రాజకీయ బినామీ పవన్ :
పవన్ వ్యాఖ్యలకు బదులుగా ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తుంది బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కి పవన్ రాజకీయ బినామీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకు రాజకీయ బినామీ కాబట్టే టిడిపి వాయిస్ నుపవన్ వినిపిస్తున్నారని ఆరోపించారు .
💥అమరావతిలో రాజధాని నిర్మాణం గురించి :
రాజధాని నిర్మాణం గురించి మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమరావతిలో నిర్మాణాలకు సాధారణ వ్యయం తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆయన రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదు అని ఖరాఖండిగా చెప్పారు.
🔴జగన్ వంద రోజుల పాలన కు వంద మార్కులు :
రాజధానితో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు . జగన్ వంద రోజుల పాలన కు ప్రజలు వంద మార్కులు ఇచ్చారని ఆయన అన్నారు . రాజధాని ని దొనకొండ కు తరలిస్తారా అనే విలేకరి ప్రశ్నకు బదులిస్తూ దొనకొండ అది ఎక్కడ ఉంది ..?అని ఎదురు ప్రశ్నించారు . 👉అభివృద్ధి ,సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తామని బొత్స సత్యనారాయణ వివరించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.