Teluguwonders:
దేశ చరిత్రలోనే తొలిసారి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు జగన్ సర్కార్.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు మేరకు కొత్త నిర్ణయం తీసుకున్నారు . టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ కోసం జస్టిస్ శివశంకర్రావును ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో రూ.100కోట్లు దాటిన టెండర్లపై ఇక న్యాయ సమీక్ష జరుగనుంది .
⭐కొత్త నిర్ణయం :
ఏపీ ప్రభుత్వం టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ (న్యాయ సమీక్ష)ను ప్రారంభించింది. పారదర్శకత కోసం ప్రివ్యూ ప్రాసెస్ చట్టాన్ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి జగన్ గతంలోనే చెప్పారు.
🔴ప్రివ్యూ ప్రాసెస్ చట్టం:
రూ.100 కోట్లు పైగా పనుల టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ (న్యాయ సమీక్ష) చేస్తారు.గత అసెంబ్లీ సమావేశాల్లోనే జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియకు సంబంధించి చట్టం చేశారు. దేశ౦లో ఎక్కడా లేని విధంగా తొలిసారి.. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం కొత్త విదానానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత తీసుకొస్తామన్నారు. అసెంబ్లీలోనూ చట్టాన్ని చేశారు. చెప్పినట్లుగానే జగన్ హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జిని సూచించాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరారు.జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ చేసేందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ రావును నియమించారు. హైకోర్టు ప్రధాన న్యామమూర్తి సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ శివశంకర్ రావు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
👉టెండర్ రూ.100 కోట్లు దాటితే..:
ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ రూ.100 కోట్లు దాటితే.. జడ్జి టెండర్కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. అలాగే సాంకేతిక విభాగం నుంచి సలహాలు, సూచనలు, వివరాలు తీసుకోవచ్చు. టెండర్ల విషయంలో జడ్జి చేసే సిఫార్సులను సంబంధిత శాఖ కచ్చితంగా పాటించాలి. జడ్జి 8 రోజులు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. పలు సూచనలు, సలహాలు ఇస్తారు. మొత్తం ఈ విధానంలో 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. ఆ తర్వాతే బిడ్డింగ్ పారదర్శకంగా కాంట్రాక్టర్లకు దక్కుతుంది. ఈ రకంగా ఆయన దేశం లొనే తొలిసారి పారదర్శక బిడ్డింగ్ ప్రాసెస్ కి శ్రీకారం చుట్టారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.