మహేష్ పై కేసు పెడతానన్న మాజీ గవర్నర్ నరసింహన్

governor Narasimhan
Spread the love

Teluguwonders:

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వారిలో చాలా పవర్ ఫుల్ గవర్నర్ ఎవరు అంటే అందరూ నరసింహం పేరే చెబుతారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత అతనికి కేంద్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా విధులను మంచి నిబద్ధతతో నిర్వహించిన నరసింహన్ తన అనుభవాలను చిట్ట చివరిగా మీడియాతో పంచుకున్నారు.

ఆయన పదవిలో ఉన్నప్పుడు అతనిని ఒక డిక్టేటర్ లాగా సర్వాధికారి లాగా పోలుస్తూ మీడియా ఒక పతాక శీర్షికన ప్రచురించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని నరసింహం పేర్కొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఒక తెలుగు పాపులర్ పత్రిక ఇకపై గవర్నరే సర్వాధికారి అంటూ మహేష్ బాబు ఒక సినిమాలో వేసుకున్న పోలీస్ డ్రెస్ శరీరానికి నరసింహం తలను తీసుకువచ్చి పెట్టి ఆయన ఒక పోలీస్ బాస్ గా మొదటి పేజీలో కథనం రాశారు.

ఆ విషయంపై తాజాగా మాజీ గవర్నర్ నరసింహన్ స్పందించారు. ఆయన తాను పోలీస్ గా ఉన్న రోజులను గుర్తుతెచ్చుకుంటూ…. ఎప్పుడో 1972లో తాను పోలీస్ డ్రెస్ వేసుకున్నానని…. ఆ తర్వాత ఎప్పుడు వేసుకోలేదని కానీ పేపర్లో తనను పోలీసు బాసు లాగా ఏదో శరీరానికి తన తలకాయను అంటించడం చూసి షాక్ కి గురైనట్లు ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒక పార్టీ లో మహేష్ బాబును కలిసిన నరసింహన్ ఇదే విషయంపై మహేష్ తో వ్యంగ్యంగా సెటైర్లు వేసి వార్నింగ్ ఇచ్చాడట.

“మహేష్ నీ పైన నేను చీటింగ్ కేసు మరియు ఫోర్జరీ కేసు పెడతాను. నీ శరీరానికి నా తలను అంటించి పేపర్లలో వేశారు కాబట్టి నేను నీ పై కేసు పెట్టబోతున్నాను” అని అతనితో జోక్ చేసినట్లు గవర్నర్ గుర్తు చేసుకున్నాడు. దీనికి వారిద్దరూ గట్టిగా నవ్వుకున్నారట. ఇంకా తన జీవితంలో ఇది ఒక మరచిపోలేని జ్ఞాపకం అని.. సర్వాధికారి అంటూ ఒక పోలీస్ డ్రెస్ లో తనని వేసిన బొమ్మ చూపించి చూడండి మీ తాత ఎంత గొప్ప వాడో అంటూ తన మనవళ్లు, మనవరాళ్లకు గొప్పగా చూపించుకుంటానని గవర్నర్ ఈ సందర్భంగా సరదాగా అన్నాడు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading