Teluguwonders:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో రోజురోజుకి కామెడీ సెటైర్లు ఎక్కువైపోతున్నాయి. నిజానికి పవన్ స్పీచ్ కూడా కామెడీని పండిస్తుంటుంది. హీరోగా రాజకీయాల్లోకి వచ్చి.. చివరికి పవన్ ఇలా ప్రతి ఒక్కరి చేత మాటలు పడటం, జనసేనికులకు బాధ కలిగించే అంశమే. పైగా కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని, రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ వదిలేసుకున్నాడు. ఇది కాదనలేని నిజం. ఏ ఆదాయం లేనప్పుడు రాజకీయాల్లోకి రావడం వేరు, కోట్లు వచ్చి పడుతున్న వేళ.. వాటిని కాదనుకుని రాజకీయాల్లోకి రావడం వేరు. ఈ విషయంలో పవన్ని ఎవ్వరూ విమర్శించలేరు. కానీ ఎందుకో ఇప్పటికీ పవన్ రాజకీయ నాయకుడిగా మారలేకపోయాడు. అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తెలిసినవే.
అయితే జగన్ పై తీవ్రంగా విరుచుకపడటంలో తప్పు లేదు. రాజకీయ నాయకుడిగా పవన్ కి ఆ హక్కు ఉంది. కానీ పవన్ మాట్లాడిన మాటల్లో ఓ మాట పవన్ రాజకీయ జీవితం ఎలా మలుపు తిరగబోతుందో చెప్పకనే చెబుతుంది. పవన్ కళ్యాణ్ రాజధాని గురించి మాట్లాడుతూ.. రాజధానిని మారిస్తే.. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లను అవమానించినట్లు అవుతుందని పవన్ తెలిపారు.
పవన్ చేసిన ఈ వాఖ్యలు చూస్తుంటే పరోక్షంగా బీజేపీ నాయకత్వానికి ఎదురు తిరగకూడదు అని జగన్ ను బెదిరించారా ? లేక, మోదీ ఏం చెబితే అది చెయ్యాలి గాని, సొంతగా మీరు ఏది చెయ్యకూడదు అని పవన్ హితవు పలికారా ? ఇంతలో ఎంత మార్పు..? మొన్నటివరకూ మోదీ పంచె ఊడతీసి కొడతా అన్న పవన్.. ఇప్పుడు ఎందుకు బీజేపీ అధినాయత్వానికి అంత మర్యాద ఇస్తున్నారు.. ? అంటే పవన్, భవిష్యత్తులో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటాడేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత పార్టీని బీజేపీలో కలిపేస్తాడని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఇది నిజం అయితే మాత్రం.. ఇంకా పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పై ఎలాంటి అవగాహన లేదనుకోవాలి. పవన్ ఎప్పుడు చెప్పే.. తను సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చానని, రాజకీయాలలోకి కూడా అలానే వచ్చానని, దేశ సేవ నిమిత్తం ఇక పై సినిమాలు చేయకుండా ప్రజల సేవ చేస్తానని పవన్ చెబుతుంటారు. ఈ మాటల్లో కొంచెం అన్నా నిజం ఉంటే.. పవన్ ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.