Teluguwonders:
కశ్మీర్పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్..చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నది. కశ్మీర్పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన పోల్చిన విధానం పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని, ఆయన తీరు విస్మయానికి గురిచేసిందని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు.
👉విషయమేమిటంటే :
కాశ్మీర్ పై కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసిస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులతో పోల్చిన విషయం తెలిసిందే.
🔴అళగిరి వ్యాఖ్యలు :
ఈశాన్య రాష్ట్రాలకున్న ప్రత్యేక ప్రతిపత్తిని మాత్రం కేంద్రం ఎందుకు తొలగించట్లేదో తెలుసుకోవాలనుకుంటున్నానని అళగిరి వ్యాఖ్యానించారు. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంగానే జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఆరోపించారు. ఇలాంటి ద్వంద్వ నీతిని రజనీకాంత్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. కోట్లాది మంది హక్కులను హరించిన మోదీ, అమిత్ షా కృష్ణార్జునులు ఎలా అవుతారన్నారు. మరోసారి మహాభారతాన్ని చదివి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని అళగిరి వ్యాఖ్యానించారు.
💥అసలు రజనీకాంత్ ఏమన్నారంటే :
జమ్మూ కశ్మీర్కు 370 రద్దు చేయడంపై రజనీకాంత్ చెన్నైలో జరిగిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్..లెర్నింగ్..లీడింగ్’ పుస్తకావిష్కరణ సభలో స్పందించారు. ‘‘మిషన్ కశ్మీర్ విజయవంతమైనందుకు హృదయపూర్వక అభినందనలు. పార్లమెంటులో అమిత్షా ప్రసంగం అద్భుతం. అమిత్ షా-మోదీ ఇద్దరూ కృష్ణార్జునుల వంటి వారు. ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు అన్నది మాత్రం వారికే తెలుసు’’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.