Teluguwonders:
అమరావతి
ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో!
రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది.
బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది.
ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది.
అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు.
అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి?
ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు?
మీ సొంత ఇళ్ళను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు?
ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.