Teluguwonders:
ఏపీలోని పేదింటి ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జగన్ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెంపు.ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. 1.20 లక్షలకు పెంపు.
ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు.
బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలకు పెంపు.
బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు. మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు.
భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.