న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో

0

Judges: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో అతడ్ని జిల్లా జైలుకు తరలించారు.

Leave a Reply