న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో
![](https://i0.wp.com/teluguwonders.com/wp-content/uploads/2021/07/n2973578727f0683f24d7b9ead1b58db6131f643c33111b31aee817487a1bf124d63db8f2b.jpg?fit=640%2C360&ssl=1)
Judges: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో అతడ్ని జిల్లా జైలుకు తరలించారు.