కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అమ్మవారికి జగన్ వస్త్రాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
