మెగా స్టార్ ను పిసినారి అని ,తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సొంత ఊరు కి కూడా ఏమీ చేయలేదని ఏవేవో మాటలు వినిపిస్తాయి గానీ మెగాస్టార్ మాత్రం చాలా సందర్భాల్లో తను చేసే మంచి పనులతో తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ ఉంటాడు.గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా తన వంతుగా సహాయం చేసేవాడు. ఇప్పుడు తాజాగామెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనను మెగాస్టార్ని చేసిన ఇంత పెద్ద వాడ్ని చేసిన ఇండస్ట్రీ కోసం భారీ విరాళం ప్రకటించారు. స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణ రావు పుట్టిన రోజును ప్రతి ఏటా డైరెక్టర్స్ డేగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే4 ఆయన దాసరి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం నాడు హైదరాబాద్లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘానికి తన వంతు సహాయంగా రూ. 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.అది.. తెలిసిన వారంతా ఎంతైనా మెగాస్టార్.. మెగాస్టారే అని కొనియాడుతున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.