తూర్పులో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అటు విద్య..ఇటు ఆర్యోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో ఏడు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి…