నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..
కుక్కర్బాంబు పేలుళ్లతో నేపాల్ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
🔴కుక్కర్బాంబు గుర్తింపు: ఇక ఇవాళ బిరట్నగర్లో మరో కుక్కర్బాంబు కలకలం రేపింది. కుక్కర్ బాంబును గుర్తించిన స్థానికులు.. భద్రతా దళాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి దాన్ని డిస్పోజ్ చేశారు. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్న 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు.