HanuMan : మొదటి సినిమా ‘ఆ’తోనే క్రియేటివ్ డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ పేరు తెచ్చుకున్నారు. ఆ తరవాత యాంగ్రీమ్యాన్ రాజశేఖర్తో ‘కల్కి’ సినిమా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 2021 లో యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ‘జాంబీ రెడ్డి’ సినిమా చేశారు. తెలుగులో తొలి జాంబీ జోనర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకొని సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత తేజతో ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులకు చెబుతూ టైటిల్ను రివీల్ చేస్తూ ప్రశాంత్ వర్మ విడుదల చేసిన వీడియో అటు సినీ ప్రేక్షకులను, ఇటు నెటిజన్స్ ను అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘బాహుబలి’ రేంజ్లో ఈ సినిమా ఉంటుదంటూ అంతా ప్రశంసించారు.
ఐతే ఆ అంచనాలను మరింత రెట్టింపు చేయడానికి ఇప్పుడు ‘హనుమాన్’ టీజర్ మన ముందు వచ్చేస్తుంది. ఈనెల 15న ‘హనుమాన్’ టీజర్ను విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.