గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిపై జరుగుతున్న ఊహా గానాలకు అల్లు అర్జున్ చెక్ పెట్టాడు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ సినిమాను ముందుగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ చిత్రాల దర్శక,నిర్మాతలు,హీరోలు ఒక అండర్ స్టాండింగ్ వచ్చిన తర్వాత విడుదల తేదిని ప్రకటించాలని ముందుగా అనుకున్నారు. కానీ ‘అల వైకుంఠపురములో’ టీమ్ మాత్రం సడెన్గా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్.. హడావుడిగా జనవరి 12నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాధారణంగా సినిమాలన్ని శుక్రవారమే రిలీజ్ అవుతుంటాయి. అందుకు భిన్నంగా వీళ్లిద్దరు సండే రిలీజ్ డేట్ కోసం పోటీ పడ్డారు. ఇద్దరు ఒకే రోజు వస్తే.. కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి రావడం వంటి సమస్యలు వుండటంతో ఇద్దరు నిర్మాతలు ఒక అండర్ స్టాండింగ్తో ఒకరోజు గ్యాప్లో తమ సినిమాలు విడుదల చేసుకున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.