జ్యూస్ ని ఈ విధంగా తీసుకున్నందుకు ఆవిడకి అవయవాలు దెబ్బ తిన్నాయి

0

పండ్ల రసం తాగితే ఆరోగ్యం వస్తుందని మనకు తెలుసు .ఆవిడ కి కూడా తెలుసు కానీ మన కన్నా ఎక్కువగా. పండ్ల రసం తాగితేనే అంత ఆరోగ్యం వస్తుంటే, నేరుగా ఇంజక్షన్ చేసుకుంటే ఇంకెంత ఆరోగ్యం వస్తుందో అని ఆలోచించిన ఓ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జెంగ్ అనే 51 ఏళ్ల మహిళకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. దీంతో నిత్యం పండ్ల రసాన్ని తాగడం అలవాటు చేసుకుంది.

తర్వాత ఒకేసారి పండ్ల రసం నేరుగా శరీరానికి వెళ్తుందా లేదా అనే అనుమానంతో వాటిని ఇంజక్షన్ చేసుకోవాలని ఆలోచించింది. ఈ సందర్భంగా 20 రకాల పండ్లను జ్యూస్ చేసి వడపోసింది. ఆ రసాన్ని సిరెంజీలోకి ఎక్కించుకుని ఇంజక్షన్ చేసుకుంది. కొన్ని గంటల తర్వాత ఆమె శరీరం దురద పెట్టడం ప్రారంభమైంది. అనంతరం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త వెంటనే ఆసుపత్రిలో చేర్చాడు.

ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమై ఉంటే ఆమె ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ఇంజక్షన్ వల్ల ఆమె కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితీత్తులు దెబ్బతిన్నాయన్నారు. ఐదు రోజులపాటు ఐసీయూ ఉంచి చికిత్స అందించారు. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకే అంటారు ఆశ ఉండవచ్చు కాని అత్యాశ ఉండకూడదు అని..

Leave a Reply