భారీగా పెరిగిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!

0

పడిపోతూ వస్తున్న బంగారం ధర పైకి కదిలింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ఈ రోజు పెరిగింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర మిలమిలమంటోంది.

  • బంగారం ధర తగ్గుదలకు బ్రేక్
  • వెండి పరుగు
  • అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైకి
  • 1,500 డాలర్ల స్థాయిలో కదలిక

పసిడి ధర తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 పెరిగింది. దీంతో ధర రూ.39,960కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,630కు చేరింది. పసిడి ధర బాటలోనే బంగారం ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,900కు ఎగసింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో ధర రూ.38,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.37,400కు ఎగసింది.

బంగారం ధర బాటలోనే సిల్వర్ కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.48,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 1,500.45 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 17.90 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

 

Leave a Reply