8 వేల మెట్లు ఉన్న.. ఓ స్వర్గం లాంటి.. దేవాలయం…

Spread the love

సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందులోనూఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతత తో ..పాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది. 🔅కట్టిపడేసే రమణీయ దృశ్యాలు : చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం..చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోన్న ఆ ప్రదేశం చైనాలోని గిజావు రాష్ట్రంలో ఫంజింగ్‌షాన్‌ అనే ప్రదేశం లో ఉంది. అక్కడ ఒక కొండ మీద ప్రముఖ బౌద్ధ ఆలయం ఉంది..
కొండపై ఉన్న ఆ బౌద్ధ ఆలయాన్ని సందర్శించడానికి.. పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు. ఈ కొండ యొక్క విశేషం ఏమిటంటే ఈ కొండ రెండుగా చీలి ఉంటుంది. ఒక భాగంలో బుద్ధుని ఆలయం ఉంటే, మరో భాగంలో మైత్రేయ ఆలయం ఉంటుంది.ఈ రెండింటిని కలుపుతూ చిన్న వంతెన ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోవాలంటే 8 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఆ శ్రమను ఎవరు లెక్క చేయరు. మెట్ల గుండా వెళుతుంటే ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. లేదా హెలికాప్టర్ ద్వారా కూడా ఈ కొండపైకి చేరుకోవచ్చు .ఈ కొండపైన ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడం అనేది మనసుకు గొప్ప అనుభూతిని ,సంతోషాన్నిఇస్తుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading