ఒక్క రూపాయి మాత్రమే…

Spread the love

ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలో పౌష్టికాహారం.. పోషక వినియోగం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది.

🔴రేషన్ లో 1రూపాయి కే రాగులు : ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా కేవలం ఒక్క రూపాయికే కిలో రాగులును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
🔴జులై నుంచిఈప్రాంతాల్లో : పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని ప్రాంతాలలో దీనిని అమలు చేస్తామని..ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తామన్నారు.గజపతి, కల్హండి, కందమల్, కోరాపుట్, మల్కన్ గిరి, రాయగడ, నౌపాడ ప్రాంతాల్లో ప్రతీ ఒక్క రేషన్ వినియోగదారుడు ఒక్క రూపాయికే కిలో రాగిని జులై నుంచి పొందవచ్చన్నారు. 17 వేల 500 క్వింటాళ్ల రాగిని రేషన్ కార్డు వినియోగదారులకు అందచేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో లక్ష క్వింటాళ్ల రాగి ధాన్యాన్ని రైతుల నుండి సేకరిస్తామని..ఇందుకు ప్రతి క్వింటాల్‌కు రూ. 2 వేల 897 చెల్లిస్తామన్నారు. దీనివల్ల రాగి రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుందని ఆదిత్య తెలిపారు.

🔴రాగిని ప్రమోట్ చేయడానికి: రాష్ట్రంలో ఉండే బేకరీలు, బిస్కట్స్ తయారు చేసే కంపెనీలు, స్వీట్ స్టాల్స్, మెగా రిటైల్ కౌంటర్ల వారితో ఒప్పందాలు కుదుర్చుకుని రాగిని ప్రమోట్ చేయాలని ఆదిత్య సూచించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading