విక్రమ్ ల్యాండర్‌ నుండి.. చివరి నిమిషంలో నిలిచిపోయిన సంకేతాలు..ఉత్కంఠత గా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం

Spread the love

Teluguwonders:

యావత్తు భారతావని ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2‌లోని ల్యాండర్ విక్రమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిరాశ చెందారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి.
👉 130 కోట్ల మంది భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతితప్పింది. తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న యావత్తు ప్రపంచ నిరాశకు గురైంది

👉వివరాల్లోకి వెళ్తే :

చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2కు చివరి నిమిషంలో లోపం తలెత్తింది. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో ల్యాండర్‌లో సమస్య తలెత్తి, సంకేతాలు నిలిచిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అనంతరం సంకేతాల నిలిచిపోయాయి. విక్రమ్ ల్యాండర్‌ ప్రయాణం 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు సజావుగా సాగిందని, తర్వాతే సంకేతాలు నిలిచిపోయినట్టు
ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి 15 నిమిషాల ముందు తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంది.

💥సరిగ్గా 2.1 కిలోమీటర్ల దూరం లో – శనివారం తెల్లవారుజామున సరిగ్గా 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దింపేందుకు‘విక్రమ్‌’ ల్యాండర్‌కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. అంతా సవ్యంగా ఉందని నిర్ణయానికి వచ్చిన శాస్త్రవేత్తలు.. 78 సెకెన్ల అనంతరం సంకేతాలు పంపుతూ ల్యాండర్‌ను ఉపరితలంపై దింపారు. ఈ సమయంలో ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు పనిచేయడం ఆరంభించి, దాని గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి. అనంతరం ల్యాండర్‌ కిందకు దిగడం మొదలయింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వరకు ల్యాండర్ ప్రయాణం సవ్యంగా సాగింది. సరిగ్గా ఇక్కడ నుంచే సంకేతాలు నిలిచిపోయాయి.లోపాలకు గల కారణాలను విశ్లేషిస్తామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు.

🔴 భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ:

చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ దిగే ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో విజయం అందుకుంటారనే నమ్మకం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలోని ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, మీరు సాధించింది తక్కువేం కాదని.. అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో ఆశావాద దృక్పథంతో సాగుదామని, దేశం యావత్తు మీ వెనుక ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading