Teluguwonders:
కడక్నాథ్ కోడి.. ప్రస్తుతం నిర్మల్ చుట్టుపక్కల అత్యధికంగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం కూడా ఉందండోయ్.. అదే ఈ కోడి రేటు! అవును .. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. ఇందులో పుంజుకయితే ఇంకాస్త రేటు ఎక్కువే. ఈ కోడి పూర్తిగా నలుపు రంగులో ఉండడం స్పెషల్. గతంలో ఎవరికీ తెలియని ఈ కోళ్లను ప్రస్తుతం నిర్మల్ ప్రాంతాల్లో అధికంగా విక్రయిస్తున్నారు.
మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా ఇవి నిర్మల్ జిల్లాకు దిగుమతవుతున్నాయి. కాళ్లు, కీళ్ల నొప్పులు, కిడ్నీల్లో రాళ్లు, ఆస్తమా, బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఈ కోడిని తింటే రోగాలు నయమవుతాయని ప్రచారం ఈమధ్య జోరందుకుంది.
దీంతో ఈ కోళ్లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా గ్రామాల్లో లభించే దేశీకోళ్లు ఒక్కోటి రూ.400 వరకు ధర పలుకుతుండగా, బాయిలర్ చికెన్ కిలో రూ.180, మటన్ రూ.500 వరకు అమ్ముతున్నారు. ఈ కడక్నాథ్ కోళ్లు మాత్రం కిలో నుంచి కిలోన్నర బరువు ఉన్నప్పటికీ ధర మాత్రం రూ.1,200 నుంచి రూ. 1,500 వరకు పలుకుతుండటం గమనార్హం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.