పాక్ టీవీ చానెల్‌లో జరిగిన ఫన్నీ ఘటన!పాక్ ను ఆడుకుంటున్న trollers

Spread the love

Teluguwonders:

పాక్ టీవీలో కశ్మీర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. దీంతో భారత నెటిజనులు ఆ చానెల్‌పై జోకులు పేలుస్తున్నారు.

🔴వివరాల్లోకి వెళ్తే :

పాకిస్తాన్ కి సంబందించిన ఓ టీవీ చానెల్‌లో సీరియస్‌గా డిబేట్ సాగుతోంది. ఇంతలో కూర్చీ విరిగిన శబ్దం. ఏం జరిగిందా అని చూస్తే.. ఆ కార్యక్రమంలో పాల్గోన్న ఓ విశ్లేషకుడు కిందపడటం కనిపించింది. ఇంకేముంది ఈ సన్నివేశం చూడగానే ప్రేక్షకులు గొల్లున నవ్వారు. ఆ ఆకస్మిక ఘటనకు ఎలా స్పందించాలో తెలియక టీవీ చానెల్ న్యూస్ రీడర్‌ నాలుక కరుచుకున్నాడు.

ఈ ఘటన పాకిస్థాన్‌లోని జీటీవీ చానెల్‌ స్టూడియోలో చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై ఆ టీవీలో జరిగిన చర్చకు మజార్ బర్లాస్ అనే విశ్లేషకుడు హాజరయ్యాడు. వాడీ వేడీగా చర్చ సాగుతుండగా.. మజార్ కూర్చీ విరిగింది. దీంతో అతడు కిందపడిపోయాడు. ఆ సమయంలో బ్రేక్ చెప్పాల్సిన న్యూస్ రీడర్.. నాలుక కరుచుకున్నాడు.

ఇదంతా లైవ్‌లో నేరుగా ప్రసారమైంది. దీంతో నెటిజనులు ఆ క్లిప్‌ను రికార్డు చేసుకుని సోషల్ మీడియాలో వదిలారు. దీంతో అది వైరల్‌ అయ్యింది. దీనిపై పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా ట్వీట్ చేసారు . ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.👇

👉‘‘పాకిస్థాన్ మనపై విజయం సాధించేందుకు ఉన్న ఒకే ఒక్క దారి.. మనల్ని నవ్విస్తూ చంపేయడమే!’’

👉‘‘నవ్వు ఆపుకోడానికి ప్రయత్నిస్తున్న యాంకర్’’ అని ఒకరు,

👉‘‘ఆ యాంకర్ ఎక్స్‌ప్రెషన్.. కొన్ని మిలియన్లు విలువ చేస్తుంది’’ అని ఇంకొకరు

👉‘‘సరైన కూర్చీలే లేవు.. వాళ్లకు కశ్మీర్ కావాలంట’’
👉‘‘ఇన్‌స్టాల్మంట్‌లో పడ్డాడు” అంటూ ఇలా నెటిజెన్స్ పలువురు ట్వీట్ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. సరిగ్గా కశ్మీర్ అంశంపై చర్చలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం భారత నెటిజనులు ఆ పాక్ చానెల్‌ను ఆడేసుకుంటున్నారు. ఆ వీడియోను షేర్ చేసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు.

💥అన్నింటి కంటే చిత్రమైన విషయం ఏమిటంటే.. మజార్ కింద పడిపోతున్నా యాంకర్, మరో మహిళ విశ్లేషకురాలు పట్టీపట్టనట్లు వ్యవహరించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading