హైదరాబాద్: హైదరాబాద్లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేసి మీడియాతో మాట్లాడారు. ‘దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. వర్షానికి పడిన గుంతలను వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. వర్షాల వల్ల గ్రేటర్లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. గంటకు రెండు సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రోడ్లపై నీరు నిలుస్తుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని వెడల్పు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో డెంగీ కేసులో తగ్గిపోయాయని’ వివరించారు.
source:https://www.ntnews.com/hyderabad-news/hyderabad-to-receive-heavy-rainfall-for-next-two-days-1-1-10607176.html
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.