తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు.
కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో జనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు తెరవడంతో.. బస్సుల కొరత స్పష్టంగా కనిపించింది. రోడ్డెక్కిన కొద్దిపాటి బస్సులు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. సమ్మె కారణంగా సొంత వాహనాల వాడకం కూడా ఎక్కువైంది.
బస్సు ఎక్కిన ప్రయాణికుల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తాత్కాలిక కండక్టర్లు వారికి టికెట్లు ఇవ్వడం లేదు. ఇదే అదనుగా హైదరాబాద్లోని సిటీ బస్సుల్లో కండక్టర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడాన్ని ‘సమయం’ గమనించింది. మెహిదీపట్నంలో బస్సు ఎక్కిన వ్యక్తి ట్యాంక్ బండ్ దగ్గర దిగితే రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చిల్లర లేదనే సాకుతో రూ.20 తీసుకుంటున్నారు. వాస్తవానికి రూ.20 ఇస్తే సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లే వీలుంది. ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టికెట్లు ఇవ్వకపోడంతో.. బస్సులో ఎంత మంది ప్రయాణించారో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోతోంది. దీంతో కొందరు తాత్కాలిక కండక్టర్లు కాసులకు కక్కుర్తిపడి.. కొంత సొమ్మును తమ జేబుల్లో వేసుకొని.. మిగతా డబ్బును ఆర్టీసీకి అప్పగిస్తున్నారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో కొందరు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు.. తమకు రోజుకు ఇస్తామని చెప్పిన మొత్తంలో సగమే ఇస్తున్నారని వాపోతున్నారు.
టికెట్లు ఇవ్వకపోడంతో.. బస్సులో ఎంత మంది ప్రయాణించారో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోతోంది. దీంతో కొందరు తాత్కాలిక కండక్టర్లు కాసులకు కక్కుర్తిపడి.. కొంత సొమ్మును తమ జేబుల్లో వేసుకొని.. మిగతా డబ్బును ఆర్టీసీకి అప్పగిస్తున్నారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో కొందరు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు.. తమకు రోజుకు ఇస్తామని చెప్పిన మొత్తంలో సగమే ఇస్తున్నారని వాపోతున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.