అనీమియా అంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనే సమస్య చాలా మంది లోనే ఉంది .ప్రత్యేకించి గర్భిణీలలో అయితే వాళ్ళ శరీరంలో రక్తశాతం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు వాపోతున్నారు. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోనేఅనీమియాను అధిగమించడం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో వినేద్దాం..
ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్గా చేసుకుని తాగాలి.
అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ను తీసుకోవాలి.
అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్ను పెంచుతుంది.
ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి.
అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి.
బీట్రూట్ ముక్కలుగా చేసుకుని జ్యూస్ చేసుకుని తాగాలి.
పాలకూర, కొత్తిమీర రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇలా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త శాతాన్ని పెంచుకోవచ్చు.
ముఖ్యంగా గర్భిణీలు ఇలా చేయడం వల్ల వారికి వారి కడుపులోని శిశువుకి చాలా మంచిది *
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.