Teluguwonders:
వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు.
వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు:
వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే , మరోవైపు కర్నూలు జిల్లా సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. వాల్మీక, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమి థియేటర్లలో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి జయరాములు గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
కాగా వాల్మీకి సినిమా పేరును ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్ బోర్డు, ఫిలిం ఛాంబర్లతో పాటు హీరో వరుణ్ తేజ్కు, చిత్రయూనిట్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఇక తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్గా తెరకెక్కిన వాల్మీకి. ఈ సినిమాను వరుణ్ తేజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.