పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన రోజా

Roja and Pawan Kalyan
Spread the love

Teluguwonders:

💥 ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయ్.. లేదంటే జనం తరిమేస్తారు అంటూ ఎమ్మెల్యే రోజా పవన్‌పై విమర్శలు గుప్పించారు. Janasena అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పుడు రోజా వాళ్లకు జతయ్యింది . ఐదేళ్ల బాబు పాలనపై పవన్ ఎందుకు పుస్తకాన్ని తీసుకురాలేదని ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు.

👉వివరాల్లోకి వెళ్తే :

కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చే కంటెంట్‌ను మాట్లాడటం మానుకోవాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. వైఎస్ఆర్సీపీ వంద రోజులపాలన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివేదిక రూపొందించడం పట్ల అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. పవన్ తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్లో పసలేదని బొత్స ఎద్దేవా చేయగా.. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా కూడా జనసేనానికి చురకలు అంటించారు. పెయిడ్ ఆర్టిసులతో ప్రభుత్వంపై బురద జల్లించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు పవన్‌తో మాట్లాడిస్తున్నారని రోజా ఆరోపించారు.

🔴చంద్రబాబు పై పుస్తకం ఏది :

జగన్ వంద రోజుల పాలన గురించి పుస్తకం తెచ్చిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు 1700 రోజులు పాలిస్తే.. ఎందుకు పుస్తకాలు వేయలేదని రోజా ప్రశ్నించారు. జగన్ వంద రోజుల పాలనతో శభాష్ అనిపించుకున్నారన్న రోజా.. చంద్రబాబు ఎన్నో అవకతవకలకు పాల్పడితే, అవినీతికి పాల్పడితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

💥ప్రజలు మిమ్మల్ని తరిమేస్తారంటూ :

ప్యాకేజీలు తీసుకొని పవన్ ఇంకా చంద్రబాబుకే పనిచేస్తున్నారని రోజా విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని రోజా సూచించారు. లేకపోతే.. ప్రజలు ఏపీలో ఉండనీయకుండా మిమ్మల్ని తరిమేస్తారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading