చూడ్డానికి వచ్చి ‘టాయ్లెట్’ కొట్టేశారు..!
Teluguwonders: లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని పుట్టిన ప్రదేశం, ఆక్స్ఫర్డ్షైర్లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్లెట్ను దుండగులు మాయం చేశారు. భారీ భద్రతతో కూడిన బ్లెన్హేమ్ ప్యాలెస్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే ఈ దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ‘గెలుపు ఒక ఎంపిక…