Vijayawada Diarrhea Out Break: విజయవాడలో 115కి చేరిన డయేరియా కేసులు.. కలుషిత నీళ్లే కారణమా?

విజయవాడలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా..
ఇక్కడి డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఎంపీడీవో స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులు, వాంతులు, విరేచనాలతో ఎవరైనా బాధపడుతున్నారా? అనే సమాచారాన్ని సేకరించే పనిలో అధికార గణం పని చేస్తుంది.
100 దాటిన డయేరియా కేసులు
విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో పెరుగుతున్న డయేరియా కేసులు.. ఇప్పటివరకు 100 దాటిన డయేరియా బాధితుల సంఖ్య. నిన్న రాత్రి మెడికల్ క్యాంప్లో 30 మంది చికిత్స కోసం వచ్చారు. మరికొందరు బాధితులు వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇప్పటికే పైప్లైన్ ద్వారా నీటి సరఫరా నిలిపివేసిన అధికారిక యంత్రాంగం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
