గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

30,000 jobs

Teluguwonders:

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 2 లక్షలు మాత్రమే. అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS, ఆర్మీ వెల్‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్లల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయి. వాటితో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జాబ్స్ కూడా ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించనివారంతా వారివారి అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఆయా నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

సెప్టెంబర్ 17న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి. డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ. అసిస్టెంట్ పోస్టుల కోసం ఎల్ఐసీ జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలకు సిలబస్ కోసం

ఇటీవల 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 (తెలంగాణ-612, ఆంధ్రప్రదేశ్‌- 777) పోస్టులున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు కూడా డిగ్రీ అర్హత. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా / డిగ్రీ ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 9 చివరి తేదీ. ఐబీపీఎస్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లల్లో 8000 పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం ఆర్మీ వెల్‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES నోటిఫికేషన్ జారీ చేసింది. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 21 చివరి తేదీ. పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమా చదివినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. కంబైన్డ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది AWES. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం

మెట్రో రైలులో ఉద్యోగాలు చేయాలనుకునేవారి కోసం మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్-MMOCL సంస్థలో జాబ్స్ ఉన్నాయి. ముంబై మెట్రోలో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-MMRDA నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం

పోలీస్ ఉద్యోగం చేయాలనుకునేవారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 16 చివరి తేదీ. ఎస్సై, ఏఎస్సై పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కూడా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 914 ఉద్యోగాలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2019 సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు అక్టోబర్ 22 చివరి తేదీ.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights